వారం రోజుల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: సూర్య గోండ

by Mahesh |
వారం రోజుల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: సూర్య గోండ
X

దిశ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని బసవేశ్వర చౌక్ వద్ద నుంచి పోడు భూముల లబ్ధిదారులు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లి జుక్కల్ త హసీల్దార్ ఏ గణేష్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు సూర్య గోండ మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు నెలల నుంచి పోడు భూముల సర్వే చేస్తున్నామని, పట్టాలు మాత్రమే ఇవ్వడం లేదని ఆయన అన్నారు

కొన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారని ఆయన అన్నారు. పట్టాలు ఇవ్వడం లేదని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పట్టా భూములకు సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే జుక్కల్ చౌరస్తాలో రాకపోకలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు శ్రీనివాస్ , ఆడిప ఆడప్ప, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story