రాజకీయాల్లోకి ఆస్తులు పెంచుకునేందుకు రావడం లేదు

by Sridhar Babu |
రాజకీయాల్లోకి ఆస్తులు పెంచుకునేందుకు రావడం లేదు
X

దిశ, ఆర్మూర్ : రాజకీయాల్లోకి ఆస్తులు పెంచుకునేందుకు రావడంలేదని, ప్రస్తుతం తనకున్న ఆస్తులతోనే సాధ్యమైనంత తక్కువలో ప్రజలకు వైద్య సేవలు అందేలా చూస్తున్నానని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ 34, 13, 35వ వార్డులలో బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం శనివారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకు సేవ చేసే గుణాన్ని తర్ఫీదు చేసి ప్రజాసేవకులను ఎన్నుకోవాలని అన్నారు. ఆర్మూర్ లో ఇదివరకు కొనసాగుతున్న బెదిరింపు రాజకీయాలను ఓటు అనే వజ్రాయుధంతో ప్రజలు తరిమికొట్టాలని పైడి రాజేష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్, కలిగోట్ గంగాధర్, జక్కం పోశెట్టి, ఆకుల జాగిర్ధర్ శ్రీనివాస్ , వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed