అనుమానాస్పదంగా యువకుడు మృతి

by Naresh |
అనుమానాస్పదంగా యువకుడు మృతి
X

దిశ, నవీపేట్‌: మండలంలోని మొకన్ పల్లి గ్రామానికి చెందిన రొడ్డ నరేష్ (30) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రొడ్డ నరేష్ ఆటో నడుపుతూ జీవనం గడుపుతాడని గత రెండు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం స్థానిక గొర్రెకుంట చెరువులో మృతదేహం పైకి రావడంతో గుర్తించి మొదటగా ఆత్మహత్య అని భావించి పోలీసులకు సమాచారం ఇవ్వగా నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని జాలరుల సహాయంతో మృతదేహంను ఒడ్డుకు తీసుకురాగా కాళ్లు చేతులకు కట్లు ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం మేరకు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, సౌత్ రూరల్ సీఐ నరేష్ సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed