రాత్రి భోజనం చేసి పడుకున్న యువతి తెల్లారేసరికి అదృశ్యం

by Sridhar Babu |
రాత్రి భోజనం చేసి పడుకున్న యువతి తెల్లారేసరికి అదృశ్యం
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని బొల్లారం గ్రామంలో యువతి అదృశ్యమైంది. స్థానిక ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మన్నే అనిత (24) అనే యువతి శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. తెల్లారి చూసేసరికి ఇంట్లో లేదు. స్నేహితుల వద్ద, చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. బొల్లారం గ్రామానికి చెందిన కోరబోయిన హరీష్ పై అనుమానం ఉందని అనిత అన్న ప్రవీణ్ కుమార్ తెలిపారని, ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed