కల్వర్టును ఢీకొని ట్రాక్టర్ బోల్తా

by Naresh |
కల్వర్టును ఢీకొని ట్రాక్టర్ బోల్తా
X

దిశ, భిక్కనూరు: ఐడర్ నింపుకొచ్చేందుకు వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగం పల్లి గ్రామానికి చెందిన వడ్డే కులస్తులు సంపంగి శివ( డ్రైవర్) మ్యాగని రాజు, మ్యాగని మైసయ్య( ట్రాక్టర్ ఓనర్) దండుగుల వెంకట్, దండుగుల ఎల్లయ్య, ధరణి భూపతిలు పొందూర్తిలో ఐడర్ రాళ్లు నింపుకొచ్చేందుకు ట్రాక్టర్‌ను తీసుకుని బయలుదేరారు. జంగం పల్లి నుంచి తలమడ్ల వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై వెళ్తున్న ఆరుగురు గాయపడ్డారు. వీరిని వెంటనే అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed