ఆక్టీవా లో పెట్టిన డబ్బులు మాయం…

by Kalyani |
ఆక్టీవా లో పెట్టిన డబ్బులు మాయం…
X

దిశ, భీంగల్: అవసరం నిమిత్తం తన బ్యాంకు అకౌంట్ లో ఉన్న రెండు లక్షలు డ్రా చేసుకొని నగదు తన హోండా ఆక్టీవా డిక్కీలో పెట్టగా బస్టాండ్ లో మాయమైన సంఘటన భీంగల్ లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కమ్మర్ పల్లి మండలం కొనసాముందర్ గ్రామానికి చెందిన కొప్పెర సాంబయ్య తన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లోని అకౌంట్ నుంచి రూ. 2 లక్షలు విత్ డ్రా చేసాడు. అట్టి నగదును తన టూవీలర్ హోండా ఆక్టీవా డిక్కీలో పెట్టుకొని స్థానిక బస్టాండ్ కు వచ్చాడు. బస్టాండ్ ఆవరణలో గల ఓ ఎలక్ట్రికల్ షాప్ వద్ద ఆగి తన పని పూర్తి చేసుకుని అక్కడ నుండి మళ్ళీ బైక్ పై కొబ్బరి బొండాల దుకాణం వద్ద ఆగాడు.

అక్కడ బొండం త్రాగి తన డబ్బులను ఒక్కసారి చెక్ చేసుకుందామని డిక్కీ లాక్ తీసి చూడగా అందులో ఉంచిన డబ్బులు కాస్త మాయమవడం తో బాధితుడు లబోదిబోమని మొత్తుకున్నాడు. విషయాన్ని భాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. బాధితుని ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్బీఐ లోని సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. డబ్బులు డ్రా చేసేటప్పుడు బ్యాంక్ లో పక్కన, లోపల ఎవరున్నారు. ఎవరు పరిశీలిస్తున్నారు, భాధితుడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్లారు. ఆయన్ని ఎవరు ఫాలో చేశారన్న దాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్ ల సహాయంతో పరిశీలిస్తున్నారు.

Next Story

Most Viewed