డబ్బులు స్వాహా చేసిన మహిళ ఇల్లు స్వాధీనం..

by Sumithra |
డబ్బులు స్వాహా చేసిన మహిళ ఇల్లు స్వాధీనం..
X

దిశ, కోటగిరి : పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో గత రెండు నెలల క్రితం గ్రామాలలోని కెనరా బ్యాంక్ అనుసంధానం అయినా సీఎస్పీ సెంటర్ నిర్వాహకురాలు సంధ్య మహిళా సంఘాలకు సంబంధించిన 45 లక్షల రూపాయల సొమ్మును స్వాహా చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో గతంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్దల సమక్షంలో సదరు మహిళ తప్పు ఒప్పుకొని స్వాహా చేసిన డబ్బులను నెల రోజులలో తిరిగి మహిళా సంఘాల ఖాతాలలో జమ చేస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇవ్వడంతో మహిళా సంఘాల సభ్యులు శాంతించారు.

కానీ ఇచ్చిన గడువు దాటి రెండు నెలలు అవుతున్నా డబ్బులు జమ చేయకపోవడంతో బుధవారం మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు కలిసి సీఎస్పీ నిర్వాహకురాలు సంధ్య ఇంటికి తాళం వేసి బహిరంగ వేలం వేశారు. ఈ వేలంలో గ్రామనికి చెందిన ఒక వ్యక్తి పద్నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకు ఇంటిని దక్కించుకున్నారు. దీనితో పాటు సదరు మహిళ మరో ఆరు లక్షల రూపాయలను జమ చేయడంతో ఇప్పటి వరకు ఇరవై లక్షల ఎనభై వేల రూపాయలును మహిళా సంఘాల సభ్యులు రికవరీ చేస్తుకున్నారు. మిగిలిన మొత్తం త్వరలోనే రికవరీ చేస్తామని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed