విద్యార్థులకు భోజనం నాణ్యతగా పెట్టాలి.. సబ్ కలెక్టర్

by Sumithra |
విద్యార్థులకు భోజనం నాణ్యతగా పెట్టాలి.. సబ్ కలెక్టర్
X

దిశ, మద్నూర్ : బుధవారం పెద్ద ఎక్లార గ్రామ శివారులో ఉన్న గురుకుల పాఠశాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మయి కొప్పిసెట్టి ఐఏఎస్ తనిఖీ చేశారు. పాఠశాల మొత్తం కలియ తిరిగి పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల కోసం వండిన అన్నం తిని రుచి చూశారు. భోజనం నాణ్యతగా పెట్టాలని, అదేవిధంగా క్యాంపస్ మొత్తం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శానిటేషన్ సరిగా లేదని, మరోసారి తనిఖీకి వచ్చినప్పుడు శానిటేషన్ సక్రమంగా చేయించాలని అన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్లనే విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులను ఆదేశించారు. భోజనం, వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. టీచర్ ల బోధన పై విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ వెంట మండల తహశీల్దార్ ఏం.డి.ముజీబ్, ఎంపీడీవో రాణి, గిర్ధవార్ శంకర్, గ్రామ పంచాయితీ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed