పెళ్లి రోజే...మృత్యుదినమైంది...

by Sridhar Babu |
పెళ్లి రోజే...మృత్యుదినమైంది...
X

దిశ, భిక్కనూరు : ఆమెకి పెళ్లి రోజే మృత్యుదినమైంది. నియంత్రణ లేని వేగంతో వెళ్తున్న కారు రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రానికి చెందిన జేపీ స్వామి గౌడ్, ఆయన భార్య నవ్యల పెళ్లిరోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి కూడవెళ్లి ఆలయానికి వెళ్లారు. ద్విచక్ర వాహనంపైతిరిగి ఇంటికి వస్తుండగా

రెండు సెకండ్లలో ఇంటికి చేరుకుంటారనగా పల్లె ప్రకృతి వనం సమీపంలోని బైపాస్ వద్ద 44 వ జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు స్పీడ్ గా వెళ్తున్న కారు ఢీకొనడంతో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం చాలా దూరం ఎగిరి పడిపోయింది. దాంతో భార్య నవ్య( 38) అక్కడికక్కడే మృతి చెందగా, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్న భర్త స్వామి గౌడ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది. తీవ్రంగా గాయపడిన స్వామి గౌడ్ ను 108 అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ మేరకు భిక్కనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed