ప్రయాణికురాలి మెడలో నుంచి గొలుసు అపహరణ

by Disha Web Desk 15 |
ప్రయాణికురాలి మెడలో నుంచి గొలుసు అపహరణ
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఆటోలో వెళ్తున్న ఒక ప్రయాణికురాలు మెడలో నుంచి బైక్ పై వచ్చిన అగంతకులు బంగారు గొలుసు తెంపుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లోని రుక్మిణీ ఛాంబర్ వద్ద జరిగింది. మోపల్ మండలం కులాస్ పూర్ కు చెందిన మహిళ ఆటోలో నిజామాబాద్ వెళ్తుంది.

వినాయక్ నగర్ లోని రాజీవ్ విగ్రహం వద్ద కొంత మంది ప్రయాణికులను దించేందుకు ఆటోను నిలిపారు. అక్కడే ఆటోలో ఉన్నా కులస్ పూర్ కు చెందిన మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని బైక్ పై పరారీ అయ్యారు. ఈ మేరకు బాధితురాలు నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed