సరిహద్దు వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి

by Sridhar Babu |
సరిహద్దు వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి
X

దిశ, భీంగల్ : వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడా, జన్కంపేట రెండు గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తు జాన్కంపేట గ్రామస్తులు ఆర్మూర్ ఆర్డీఓ ఆఫీస్ ఎదట ధర్నాశుక్రవారం నిర్వహించారు. గత కొన్ని ఏళ్లుగా ఈ రెండు గ్రామాల మధ్య నెలకొని ఉన్న ఈ భూ సరిహద్దు వివాదం గురించి అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ వివాదం చిలికి చిలికి పెద్దది అవుతోందని గ్రామస్తులు ఆరోపించారు. గత డిప్యూటీ కలెక్టర్ చిత్ర మిశ్రా ల్యాండ్స్ ఏడీ ని సరిహద్దు సర్వే చేయమని ఈ నెల 14న పంపిస్తే స్థానిక మండల ఆఫీసర్లు ఏడీ కి సహకరించలేదన్నారు. దాంతో ఏడీ తిరిగి వెళ్లిపోయారని, అప్పటి నుండి మా సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story