దేవుని హుండీ చోరీ చేసిన నిందితుడు అరెస్ట్

by Sridhar Babu |   ( Updated:2024-02-05 15:32:12.0  )
దేవుని హుండీ చోరీ చేసిన నిందితుడు అరెస్ట్
X

దిశ, ఎల్లారెడ్డి : దేవుని హుండీ పగలగొట్టి చోరీకి పాల్పడ్డ నిందితుని సోమవారం ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ రిమాండ్ కు తరలించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో తాళం పగలగొట్టి హుండీలోని డబ్బులు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ మహేష్ తెలిపారు. పోసంపల్లి గ్రామానికి చెందిన జంగా నరసింహులు చోరీ చేసినట్టు గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇతను పాత నేరస్తుడు. గతంలో కూడా ఇతన పై పలు కేసులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed