మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ దాడులు

by Sridhar Babu |
మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ దాడులు
X

దిశ, నిజామాబాద్ సిటీ : అక్రమంగా మొరం త్రవకాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహిం చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎడపల్లి మండలం తానకాలన్ గ్రామ శివారులో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజా శేఖర్ రాజు , సీఐలు అంజయ్య, అజయ్ బాబు సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఎలాంటి వే బిల్లులు లేని 2 జేసీబీలు, 3 మొరం టిప్పర్ లు సీజ్ చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story