దత్తాపూర్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

by Sridhar Babu |
దత్తాపూర్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామ శివారులో శుక్రవారం పేకాట స్థావరంపై జిల్లా సీపీ కల్మేశ్వర ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి, సీఐ అంజయ్యలు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను, 12170 రూపాయల నగదును, 6 సెల్ ఫోన్లను, ఐదు బైకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ పేకాట స్థావరంపై దాడి చేసి దాడిలో స్వాధీనం చేసుకున్న ఆ నగదును నందిపేట్ పోలీసులకు అప్పగించారు. దాడిలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య, రాజేశ్వర్, సుదర్శన్, కానిస్టేబుళ్లు రాములు, గజేందర్, అనిల్, ఆజాం పాల్గొన్నారు.

Advertisement

Next Story