రాష్ట్రస్థాయి ప్రేరణ అవార్డ్స్ కి విద్యార్థినులు ఎంపిక

by Sridhar Babu |
రాష్ట్రస్థాయి ప్రేరణ అవార్డ్స్ కి విద్యార్థినులు ఎంపిక
X

దిశ, మాచారెడ్డి : జిల్లా స్థాయిలో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డ్స్ లో మాచారెడ్డి మండలం అక్కాపూర్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రేరణ అవార్డులకు ఎంపికయ్యారు. సంజన, వైష్ణవి లు ప్రదర్శించిన రెండు ప్రయోగాలు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వెలిబుచ్చారు. మొత్తం జిల్లా నుండి ఎనిమిది రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా అందులో రెండు ఒకే పాఠశాలకు దక్కడం విశేషం. విద్యార్థులకు ఈ ప్రయోగాలు చేపట్టడంలో సహకరించిన గైడ్ టీచర్ సీహెచ్. సుస్మిత, పాఠశాల హెచ్ఎం మంజుశ్రీ లను గ్రామ ఎంపీటీసీ బట్టలతా రమేష్ , మాజీ సర్పంచ్లు గడ్డం మమతా బాబు, బాలచంద్రం, వెంకటరెడ్డి, దేవచారి తదితరులు అభినందించారు.

Advertisement

Next Story