- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎస్సారెస్పీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
by Sridhar Babu |
X
దిశ, బాల్కొండ : శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటెత్తడంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సారెస్ప అధికారులతో మాట్లాడి మహారాష్ట్ర నుండి వస్తున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు లక్షల వరకు వరద వస్తుందని మహారాష్ట్ర అధికారులు తెలిపారని ఎస్సారెస్పీ అధికారులు వివరించారు. ఇప్పటికే ఎస్సారెస్పీ వరద గేట్లను 40 ఎత్తి దిగువకు 1,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ఇప్పటికే వచ్చి చేరుతుందన్నారు. దిగువన, ఎగువన ఉన్న ప్రజలకు, గ్రామాలకు, వ్యవసాయ పంటలకు ఇబ్బంది తలెత్తకుండా నీటిని విడుదల చేయాలన్నారు. వారి వెంట సీపీ కల్మేశ్వర్, ఎస్ఆర్ఎస్పీ ఈఈ చక్రపాణి, ఏఈ వంశీ, సారిక, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Advertisement
Next Story