రూ. 7 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం

by Sridhar Babu |
రూ. 7 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండ లంలో గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం గాంధారి మండలం తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న 75 గంజాయి మొక్కలను గుర్తించారు. వాటి విలువ రూ.7 లక్షల 50 వేలు ఉంటుందని కిషన్ తెలిపారు. అటవీ ప్రాంతంలో గంజాయి మొక్కలను సాగు చేస్తూ వాటికి స్థానికంగా ఉన్న పంప్ సెట్ల నుంచి నీటిని సేకరించి పెంచుతున్నట్లు గుర్తించారు. గంజాయి సాగవుతున్న ప్రాంతం అటవీ ప్రాంతం కావడంతో ఈ మేరకు కేసు నమోదు చేసి గంజాయి మొక్కలను ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ ఎల్లారెడ్డి వారికి అప్పజెప్పినట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషన్ తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాంచందర్, హెడ్ కానిస్టేబుల్ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు ఉత్తమ్, బోజన్న, అవినాష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed