అర్జీదారుల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి.. కలెక్టర్

by Sumithra |
అర్జీదారుల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి.. కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి చర్య తీసుకోవాలని సూచించారు.

ప్రజల సమస్యల పై అధికారులు స్పందించి అర్జీదారుల సమస్య పై సమాధానం అందజేయాలన్నారు. ప్రజావాణిలో 74 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed