అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Mahesh |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి 35 సంవత్సరాల వ్యక్తి డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మృతుడి మృతి పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అర్ధరాత్రి వర్షం ధాటికి డ్రైనేజీలో పడి మృతి చెందారా.. లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సదరు వ్యక్తిపై దాడి చేసి డ్రైనేజీలో పారేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైనేజీలో పడితే శరీరం మొత్తం గాయాలు ఎందుకు అయి ఉంటాయి అనే విషయం కూడా పలు రకాలుగా అనుమానాలకు తావిస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తు పడితే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed