లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

by Sridhar Babu |
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
X

దిశ,జక్రాన్ పల్లి : నాలుగు వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండేడ్ గా చిక్కారు. ఈ సంఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం తోర్లికొండ గ్రామంలో జరిగింది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడు ఇటీవల తోర్లికొండలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దానిని రిజిస్ట్రేషన్ కోసం ఎన్ఓసీ నిమిత్తం

గ్రామ పంచాయతీ కార్యదర్శి తోపారం మనోహర్ ను సంప్రదించారు. కానీ అతడు రూ.15 వేలు లంచం ఇస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మనోహర్ రూ.4 వేల లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ, ఇన్స్ పెక్టర్ లు దాడి చేసి రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నారు. గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. మనోహర్ ను అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed