ఒక పక్క తండ్రి మరణం... మరోపక్క పరీక్షతో సమరం

by Kalyani |
ఒక పక్క తండ్రి మరణం... మరోపక్క పరీక్షతో సమరం
X

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఘటనకు చెందిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన దండు శ్రీను వృత్తి రీత్యా గ్రామ పంచాయతీ కార్మికుడు. అతని కుమార్తె దండు స్రవంతి పదో తరగతి పూర్తి కావచ్చింది. ఉదయం లేచి పదో తరగతి పరీక్షకు వెళ్లాల్సిన కుమార్తెకు కావలసిన ప్యాడ్, పెన్ను తదితర వస్తువులను తెచ్చిచ్చి నువ్వు పరీక్షలు బాగా రాయాలి బిడ్డా అని ఆశీర్వాదమిచ్చాడు. అయితే ఒక గదిలో పరీక్షల కోసం చదువుకుంటున్న కూతురుకి మరో గదిలో పడుకున్న తండ్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసింది. దీంతో తీవ్ర విషాదంలో మునిగి పోయిన కుమార్తె గుండె నిబ్బరం చేసుకొని, కన్నీరు కారుస్తూ పరీక్షకు హాజరైయింది.

Advertisement

Next Story