- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ పార్టీ దోచుకున్నంత ప్రజాధనం బ్రిటీష్ వాళ్లు కూడా దోచుకోలే: బీజీపీ ఎంపీ అభ్యర్థి
దిశ, నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం దేశంలో దోచుకున్నంతగా ప్రజా ధనాన్ని బ్రిటిష్ వారు కూడా దోచుకోలేదని నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని 38వ డివిజన్ పరిధిలో 131, 132 బూత్ లో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో అరవింద్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు లకు పెట్టింది పేరని ఆ పార్టీ నాయకులు నింగి నేలను కూడా తమ అక్రమాలను అవినీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు.
రైతులకు రుణమాఫీ అందిస్తామని ఎన్నికల ముందు ప్రచారాలు చెప్పిన ముఖ్యమంత్రి ఆగస్టు 15 ప్రకటిస్తామని చెబుతూ మరోసారి రైతులను మోసం చేసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. తాము ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మోడీకి తమ ఓటు అని తాము అడగకముందే చెబుతున్నారని ఇందుకు నిదర్శనమే బిజెపి పార్టీ అవినీతిరహిత పాలన అద్దం పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పటేల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచ రెడ్డి ప్రవళిక, బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ, ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.