పాఠశాలలో వస్తువులు ధ్వంసం చేసిన దుండగులు

by Naveena |   ( Updated:2024-10-14 15:39:20.0  )
పాఠశాలలో వస్తువులు ధ్వంసం చేసిన దుండగులు
X

దిశ భిక్కనూరు :డోర్ పగలగొట్టి..డైనింగ్ హాల్ లో నల్లాలు విరగొట్టిన ఘటన జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలకు దసరా హాలిడేస్ కావడంతో..ఇదే అదనుగా భావించిన దుండగులు నీటి శుద్ధి యంత్రంను ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం బస్వాపూర్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ ధ్వంసం చేసిన ఘటన మరువకముందే..తాజాగా జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో రిపీట్ కావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..పాఠశాల పిటిఎఫ్ తునికి మల్లేశం( పార్ట్ టైం వర్కర్) గదులను శుభ్రం చేసేందుకు వచ్చాడు. గదిని శుభ్రం చేసేందుకు డోర్ ను తెరవగా..నీటి శుద్ధి యంత్రం ధ్వంసం చేసి ఉందని ఆరోపించాడు. అలాగే డైనింగ్ హాల్ లో నల్లాలు విరగొట్టి కింద పడేశారన్నారు. దీంతో డోర్ ధ్వంసం చేసి నల్లాలు పగులగొట్టిన వారిని గుర్తించి..కఠినంగా శిక్షించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాలలనే టార్గెట్ గా చేసుకొని ఫర్నీచర్ ను ధ్వంసం చేయడం వెనక మర్మమేమిటన్నది సస్పెన్స్ గా మారింది.

Next Story

Most Viewed