భార్య, కూతురు ఇంటికి రావడం లేదని.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

by Mahesh |
భార్య, కూతురు ఇంటికి రావడం లేదని.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, భిక్కనూరు: ఇంట్లో గొడవ పెట్టుకొని వెళ్లిన భార్య, కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంటికి తిరిగి రాకపోవడం, కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్థాపానికి గురై భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన గురువారం భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన గంధం కేశయ్య (40) తాపీ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూతురు నితీషాకు పెళ్లి సంబంధాల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో, భార్య రూప, తన కూతురును వెంటబెట్టుకొని వారం రోజుల క్రితం తన పుట్టిన ఊరు నాగారంకు వెళ్ళింది. ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పిన, ఇంటికి తిరిగి భార్య కూతురు రాకపోవడం, కొన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన కేశయ్య గురువారం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో తన రేకుల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేశయ్య ఆత్మహత్యతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భిక్కనూరు ఎస్ఐ(2) రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలోని పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed