- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఆపరేషన్ స్మైల్ లో 38 మంది బాల కార్మికులకు విముక్తి
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఆపరేషన్ స్మైల్-10 లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 38 బాలకార్మికులను పట్టుకొని పని నుండి విముక్తి కల్పించినట్టు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లాల్లోని వివిధ బట్టల షాప్ లలో, ఆటో మొబైల్ షాపుల్లో, ఇటుక బట్టీల్లో పని చేస్తున్న 38 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. పట్టుకున్న వారిలో ఏడుగురు అమ్మాయిలు, 31 మంది బాలురు ఉన్నారన్నారు.
వీరిని డీసీపీవో కు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు 6 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 కి కానీ 1098 కి కానీ కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రఫీఉద్దీన్, రాజు, లావణ్య, కానిస్టేబుల్ లు భూమయ్య, సౌజన్య, శ్రీనివాస్, సుప్రజ, ప్రియాంక, శంకర్ తో పాటు జిల్లా ఆపరేషన్ స్మైల్ సిబ్బంది పాల్గొన్నారు.