వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించినందుకు గొడవ.. ముగ్గురి పై కత్తితో దాడి

by Mahesh |
వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించినందుకు గొడవ.. ముగ్గురి పై కత్తితో దాడి
X

దిశ, గాంధారి: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సదాశివ నగర్ సిఐ రామన్ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని గండిపేట గ్రామానికి చెందిన బిందాస్ మదన్ అన్న యువ సైన్యం గండివేట్ అనే వాట్సాప్ గ్రూప్‌కు అడ్మిన్గా ఉన్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన రజాక్ అనే వ్యక్తిని గ్రూప్ నుంచి తొలగించాడు. రజాక్ కోపంతో తన ఫోన్లో మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను ఎందుకు తొలగించారు అని బిందాస్ అనే వ్యక్తిని రజాక్, అతని స్నేహితులు ఫోన్లో అడిగినారు. వీరిద్దరి మధ్య గొడవ పెరిగిపోయింది.

ఇది మనసులో పెట్టుకొని శుక్రవారం రాత్రి సమయంలో జావిద్ అహ్మద్‌, రజక్ లు గ్రామపంచాయతీ ఆఫీస్ ఎదురుగా గల కాపర్తి రవీందర్ కిరణాలో బిందాస్ ఉన్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లి గొడవ పడ్డారు. అదే సమయంలో బిందాస్ దగ్గర ఉన్న కత్తితో ముగ్గురిపై దాడి చేసి పొడిచాడు. ఈ దాడిలో గాయపడిన వారు ప్రస్తుతం నిజాంబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సీఐ రామన్ తెలిపారు. బాధితులు అహ్మద్ వాంగ్ములం ఆధారంగా నిందితుడు బిందాస్ పై గాంధారి పోలీస్ స్టేషన్లో U/S 307 IPC క్రింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులు, సాక్షుల వివరాలు, ఇంకా ఎవరెవరు ఈ సంఘటనకు బాధ్యులు అనే కోణంలో దర్యాప్తు నడుస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed