తల్లిదండ్రులారా పిల్లలు పారా హుషార్..బాన్సువాడలో బాలుడి కిడ్నాప్

by srinivas |   ( Updated:2024-02-09 07:01:42.0  )
తల్లిదండ్రులారా పిల్లలు పారా హుషార్..బాన్సువాడలో బాలుడి కిడ్నాప్
X

దిశ బాన్సువాడ : కలియుగం ఎటువైపు వెళ్తున్నదో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరి ఊహలకు అందని విషయాలు ప్రతీ రోజు వెలుగు చూస్తున్నాయి. నిజంగా ఆడవారా లేక ఆడవారి వేషంలో ఉన్న మగవారా అర్థం కావడం లేదు కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పసి పిల్లాల కిడ్నప్ వ్యవహారం రోజు రోజుకు మితిమిరుతోంది. తాజాగా బాన్సువాడలో అదే జరిగింది. సంగమేశ్వర కాలనీలో లోకేష్ అనే నాలుగేళ్ల బాలుడిని ముగ్గురు మహిళలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సీసీ పూటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ విషయంపై క్లారిటీకి వచ్చారు. బాలుడి వెతుకులాటలో ఉన్నారు. తల్లిదండ్రులు మాత్రం పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed