నవీపేట్ లో కిడ్నాప్ కలకలం

by Sridhar Babu |
నవీపేట్ లో కిడ్నాప్ కలకలం
X

దిశ, నవీపేట్ : నవీపేట్ మండల కేంద్రంలో శుక్రవారం వారాంతపు సంతలో బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఒక బాలిక తన తల్లి తో కలిసి వారాంతపు సంత్ కు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి చేతులు తాకగా మూర్ఛ పోయింది. దాంతో చుట్టుపక్కల వారు బాలిక తండ్రికి చెప్పగా నిందితులను గుర్తించి కిడ్నాపర్లు అని భావించి చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ వీడియో లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కిడ్నాపర్లు కాదు ఇటుక బట్టి కార్మికులు...

మార్కెట్ లో కిడ్నాపర్లు అని భావించిన ముగ్గురు మండలంలోని మహంతం ఇటుక బట్టిలో పని చేయడానికి ఆదిలాబాద్ నుండి వచ్చిన కూలీలని నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులను పట్టుకొని పోలీసులు విచారించగా శుక్రవారం నాడు పనికి సెలవు కావడంతో మార్కెట్ లో మద్యం సేవించి తమలో తామే గొడవ పడే సమయంలో బాలికకు చేయి తగిలిందని తెలిపారు. ఇటుక బట్టి యజమానిని పిలిచి విచారించామని ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed