జువ్వాడి రత్నాకర్ రావు సేవలు అభినందనీయం

by Sridhar Babu |
జువ్వాడి రత్నాకర్ రావు సేవలు అభినందనీయం
X

దిశ, కోరుట్ల టౌన్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానేత, దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఛాయాచిత్రాన్ని జువ్వాడి కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువ్వాడి రత్నాకర్ రావు విలువలతో కూడిన రాజకీయం చేశారని ,

ఆయన సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయమన్నారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ తమ తండ్రి జువ్వాడి రత్నాకర్ రావు అనుక్షణం పేద ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే వారని, ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, నాయకులు చెదలు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, ఎంఏ నయిం, మ్యాకల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story