ఆర్మూర్ మున్సిపల్ లో అవినీతిపై విచారణ జరిపించండి

by Sridhar Babu |
ఆర్మూర్ మున్సిపల్ లో అవినీతిపై విచారణ జరిపించండి
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు మంగళవారం ధర్నా చేశారు. బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ మాట్లాడుతూ..

ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అనేక విషయాలలో అవినీతి, అక్రమాలు జరిగాయని తాము ఫిర్యాదు చేసినా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులతో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాలో కౌన్సిలర్ లు సాయికుమార్, ఆకుల సంగీత శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ పాలెపు రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, నాయకులు కాందేశ్ ప్రశాంత్, పాన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed