చెరువులో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య

by Kalyani |
చెరువులో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని వెంగళరావు నగర్ సమీపంలో ఉన్న బాబన్ షాబ్ చెరువు లో సోమవారం సాయంత్రం రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. భార్యాభర్తల మృతదేహాలను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమృతపుర్ గ్రామానికి చెందిన పెద్ద బాబయ్య, పోశమ్మ లుగా గుర్తించారు. వీరు స్థానికంగా దర్గా వద్దే ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మృతుడికి ఇద్దరు కొడుకులున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరు చెరులో పడి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు.

Advertisement

Next Story