- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నగరంలోని గాయత్రి నగర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్ వద్ద జరిగింది. నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన కె.నాగరాజు (58) వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్నాడు.
ఆదివారం సాయంత్రం తన స్కూటీపై వెళ్తుండగా ఎఫ్ఎస్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు స్కూటీని ఢీ కొట్టింది. స్కూటీ నుంచి కింద పడిన నాగరాజు పై నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు నాలుగోపట్నం పోలీసులు కేసు నమోదు చేసి బస్సును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Advertisement
Next Story