హత్య కేసులో నలుగురు నిందితులు రిమాండ్

by Sridhar Babu |
హత్య కేసులో నలుగురు నిందితులు రిమాండ్
X

దిశ, నిజాంసాగర్ : మహ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో చాకలి పోశయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా బాన్సువాడలో శుక్రవారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి, నిందితులను హాజరు పరిచారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన గుట్టమీది చాకలి పోచయ్య (58)అనే వ్యక్తి హత్యకు గురికావడం అందరికీ తెలిసిన విషయమే. మృతుడిని అతడి అల్లుడు గజ్జల నడిమింటి శ్రీకాంత్, కూతురు చాకలి సుజాత, బూర్గుల్ గ్రామానికి చెందిన గజ్జల నడిమింటి రాములు, షేక్ మహబూబ్ అనే వ్యక్తులు హతమార్చినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించడానికి సహకరించిన నిజాంసాగర్ ఎస్ఐ కె. సుధాకర్, సిబ్బంది సంగమేశ్వర్, వసీ, రాజు, రఘు, మోహన్ సింగ్, రాజేష్ లను సీఐ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed