కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్

by Sridhar Babu |
కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర తొలి మహిళ మేయర్ ఆకుల సుజాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తరఫున మేయర్ గా తొలిసారి ఆకుల లలిత 2014 నుంచి 18 వరకు పనిచేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు , నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఇంచార్జ్ షబ్బీర్ అలీ సమక్షంలో ఆకుల సుజాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆకుల సుజాత ఆకుల శ్రీశైలం దంపతులకు షబ్బీర్ అలీ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. మాజీ మేయర్ తో పాటు మాజీ కార్పొరేటర్ శ్రీహరి నాయక్, కెప్టెన్ శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు భాజన్న, గోపరి లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, అంత రెడ్డి దేవేందర్, తెలంగాణ జాగృతి మహిళా నేత అపర్ణ తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవ వేణు, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, రామ్మూర్తి, గోపి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story