ఘోర రోడ్డు ప్రమాదం.. శుభకార్యానికి వెళుతూ..

by Aamani |
ఘోర రోడ్డు ప్రమాదం.. శుభకార్యానికి వెళుతూ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్- వర్ని ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. బాన్సువాడ పట్టణంలో జరిగే ఓ శుభకార్యానికి మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన కొంతమంది ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో బాన్సువాడ నుంచి వర్ని వైపు వెళ్తున్న బొలెరో వాహనం వెళుతుండగా నసురుల్లాబాద్ శివారులో వేగంగా ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉష (35) అనే మహిళకు తలకు గాయాలు కాగా, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది.

అదే ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ ఉష తో పాటు, తీవ్రంగా గాయపడ్డ బాధితులంతా నాందేడ్ జిల్లా కేంద్రంలోని విష్ణుపురి కాలనీ వాసులని తెలిసింది. నస్రుల్లాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed