రైతులు పంటలు బాగా పండించుకోవాలి

by Sridhar Babu |
రైతులు పంటలు బాగా పండించుకోవాలి
X

దిశ, ఎల్లారెడ్డి : రైతులు పంటలు బాగా పండించుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం ఆయకట్టు నీటిని యాసంగి పంట కోసం ఆయన వదిలారు. పోచారం ప్రాజెక్టుతో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు రెండు పంటలకు నీరు అందుతుంది అని అన్నారు. రైతులు యాసంగిలో మంచి పంటలు పండించుకొని అధిక లాభం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి నాయకులు బోళ్లు నరసింహారెడ్డి, నాగిరెడ్డి పేట మండల ఎంపీపీ రాజదాసు, నాగిరెడ్డిపేట జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, పోచారం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story