ఎంపీ టికెట్ ఎవరికి లభించునో

by Sumithra |
ఎంపీ టికెట్ ఎవరికి లభించునో
X

దిశ, ఎల్లారెడ్డి : త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ పార్టీ నుంచి ఒకరిపై ఒకరు పోటీకి సిద్ధమవుతున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున మేమున్నామంటూ నాయకులు పావులు కదుపుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి మేము సైతం పోటీకి నాయకులు సిద్ధమంటున్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన సుభాష్ రెడ్డి, నాగిరెడ్డిపేట మండలం తాండూర్ వెంకంపల్లి గ్రామానికి చెందిన ఏలేటి సురేష్ రెడ్డి జహిరబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అండదండలు ఎవరికి లభించునో త్వరలోనే జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థిగా ప్రజల ముందుకు ఏలేటి సురేష్ రెడ్డి రాబోతున్నట్లు సమాచారం. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తాను వస్తున్నట్లు సురేష్ రెడ్డి వర్గీయులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed