జైల్లో రామాయణం నాటకం.. సీతను వెతుకుతూ సినిమా స్టైల్లో పారిపోయిన ఖైదీలు

by karthikeya |
జైల్లో రామాయణం నాటకం.. సీతను వెతుకుతూ సినిమా స్టైల్లో పారిపోయిన ఖైదీలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా స్టైల్లో జైలు నుంచి పారిపోయారు ఇద్దరు ఘరానా ఖైదీలు. జైలు అధికారులు, ఖైదీలు చూస్తుండగానే వాళ్లందరి ఎదుటే 20 అడుగుల గోడ దూకి పారిపోయారు. ఉత్తరాఖండ్‌లోని రోషనాబాద్ జైలులో నాటకం ఆడుతూ ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దసరా సందర్భంగా జైలులో రామాయణం నాటకం వేశారు. ఇందులో భాగంగా వానర పాత్రధారులు పంకజ్, రాజ్‌కుమార్..‌ సీతను వెతికే క్రమంలో పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే 22 అడుగుల జైలు గోడపై నుంచి దూకి పరారయ్యారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పరారైన ఖైదీల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed