కామారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం.. వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

by Mahesh |   ( Updated:2024-02-08 02:42:00.0  )
కామారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం.. వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి
X

దిశ, మాచారెడ్డి: వీధి కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చ పేట గ్రామంలో చోటు చేసుకుంది.ముస్తాబాద్ రామవ్వ (75) అనే వృద్ధురాలు పై ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి వద్దనే కుక్కలు దాడి చేశాయి. ఆమె ముఖం చేతులు పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇది గమనించిన గ్రామస్తులు వీధి కుక్కలను వెంటపడి తరిమి వేశారు. తీవ్రంగా గాయపడి రక్తస్రావంలో ఉన్న రామవ్వను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు వివరించారు. గ్రామంలో విచ్చలవిడిగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు వాటిని నివారించే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Next Story