ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు డుమ్మా

by Naresh |
ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు డుమ్మా
X

దిశ, నిజామాబాద్ సిటీ: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమీకృత భవనంలో నిర్వహించే ప్రజావాణికి అధికారులు డుమ్మా కొడుతున్నారు. దీంతో పెండింగ్‌లో ఉన్న పనులు తీరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతివారం నిర్వహించే ప్రజావాణిలో వివిధ అన్ని శాఖల ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ప్రజావాణికి హాజరై సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ పలుమార్లు ఆదేశించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజావాణికి హాజరు కాలేకపోతున్నారు. దీంతో ప్రజాసమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ప్రజావాణికి సమస్యలను విన్నవించుకునేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు తరలివస్తుంటారు. అయితే వారి సమస్యలను ఉన్నతాధికారులకు విన్నవించుకునేందుకు తరలిరాగా అధికారులు లేకపోవడంతో నిరాశతోనే ప్రజలు వెను తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వచ్చిన కొద్దిపాటి అధికారులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చరవాణిలో వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాలను వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed