- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఉరి వేసుకొని డీఆర్డీఏ ఏపీడీ ఆత్మహత్య
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డీఆర్డీఏ శాఖలో ఏపీడీగా చేస్తున్న సంజీవరావు(55) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్ లోని మారుతీనగర్ లో తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంజీవరావు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి విధులు నిర్వహించి ఇంటికి వచ్చి ఆత్మ హత్యకు పాల్పడడం కలకలం రేపింది.
అనారోగ్యంగా ఉందని ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన సంజీవరావు తిరిగి రాకపోవడంతో సంబంధిత శాఖకు చెందిన డ్రైవర్ ఇంటికి వెళ్లి పరిశీలించగా ఆత్మహత్య వ్యవహారం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలో ఎంపీడీఓ గా సంజీవరావు అందరికీ సుపరిచితులు. అందరితో కలుపుగోలుగా ఉండే సంజీవరావు ఆత్మహత్యను తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల పదోన్నతి పొందిన తర్వాత డీఆర్డీఏ కార్యాలయంలో చేరిన సంజీవరావుకు భార్య, ఒక కుమారుడు ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.