దళారులను నమ్మి మోసపోవద్దు

by Kalyani |
దళారులను నమ్మి మోసపోవద్దు
X

దిశ, నిజామాబాద్ సిటీ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ పోస్టుల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని, దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసిందని నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం తెలియజేశారు. ఆర్ బి ఎస్ కే లో, జాతీయ ఆరోగ్య మిషన్ లో వివిధ పోస్టుల కోసం అనగా వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి లు, స్టాఫ్ నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్, న్యూట్రిషన్ కౌన్సిలర్, ఎపిడిమాలజిస్ట్, ఏఎన్ఎం, ఫార్మాసిస్టు, డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉద్యోగాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువు సోమవారం సాయంత్రం తో ముగిసిందన్నారు.

కావున ఈ పోస్టులన్నీ పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే నియామకాలు చేపడతామని తెలియజేశారు. నియామకాల విషయంలో ఎలాంటి దళారులు, పైరవీకారులు, రికమండేషన్స్ను అంగీకరించమని తెలియజేశారు. దరఖాస్తుదారులు పైరవీకారులను నమ్మి వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ఇంతకు ముందు జరిగిన అన్ని నియామకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు, దరఖాస్తుదారులకు పైరవీలకు సంబంధించిన సమాచారం తెలిస్తే మా కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.

Advertisement

Next Story