నేషనల్ బాస్కెట్ బాల్ కోచ్ లుగా భీంగల్ మండల వాసులు

by Sridhar Babu |   ( Updated:2024-01-03 16:03:32.0  )
నేషనల్ బాస్కెట్ బాల్ కోచ్ లుగా భీంగల్ మండల వాసులు
X

దిశ, భీంగల్ : ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిర్వహించనున్న 67వ నేషనల్ లెవల్ బాస్కెట్ బాల్ అండర్ 14, అండర్ 17 బాలబాలికల జట్లకు జిల్లాకు చెందిన సంగెపు రాహుల్, సంగెపు ప్రశాంత్ లు కోచ్​లుగా నియమితులయ్యారు. జిల్లాలోని భీంగల్ మండలం జగిర్యాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రస్తుతం హైద్రాబాద్ లోని కొంపల్లి సన్ ఫ్లవర్ వేదిక్ స్కూల్, పీయర్ సన్ స్కూల్ లల్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు జాతీయ స్థాయి క్రీడలకు కోచ్ లుగా ఎంపికైనందుకు జిల్లా ప్రజలు రాహుల్, ప్రశాంత్ లను అభినందిస్తున్నారు.

Advertisement

Next Story