దిశ ఎఫెక్ట్... ఆసుపత్రిని సందర్శించిన అధికారులు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్... ఆసుపత్రిని సందర్శించిన అధికారులు
X

దిశ, గాంధారి : ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షేనా..... అనే శీర్షికతో దిశలో ప్రచురితమైన కథనానికి జిల్లా మండల అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు సందర్శించి ఆరా తీశారు. దాంతో మంగళవారం పూర్తిస్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బందితో ప్రభుత్వ ఆసుపత్రి కళకళలాడింది. ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిని డీసీహెచ్ ఎస్ విజయలక్ష్మి, ఎంపీఓ బాబయ్య, ఎంపీడీవో రాజేశ్వర్ సందర్శించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంగీత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed