జీజీహెచ్ నుంచి వ్యక్తి అదృశ్యం

by Kalyani |
జీజీహెచ్ నుంచి వ్యక్తి అదృశ్యం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) నుంచి గన్నారం గ్రామానికి చెందిన కుంకుల గణేష్ (21)అనే యువకుడు శుక్రవారం అదృశ్యమైనట్లు నిజామాబాద్ వన్ టౌన్ సీఐ డి.విజయ్ బాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన కుంకుల నారాయణ కొద్దిగా మతిస్థిమితం లేని తన కొడుకు గణేష్ ను జీజీహెచ్ కు గురువారం చికిత్స కోసం తీసుకొచ్చారు. బాగా రాత్రి కావడంతో హాస్పటల్ లోనే పడుకున్నారు. తెల్లారాక నిద్రలేచి చూడగా గణేశ్ కనిపించలేదు. చుట్టు పక్కల అంతటా వెదికారు. ఎక్కడా కనిపించక పోవడంతో బాధితుడు నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. గణేష్ హాస్పిటల్ నుండి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు పాయింట్ బ్లూ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడని, గణేష్ కు సరిగా మాట్లాడటం కూడా రాదని సీఐ తెలిపారు. బాధితుడు నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed