ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యం

by Sridhar Babu |
ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యం
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కటికగలిలో నివాసం ఉండే ఓ వివాహిత అదృశ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అంకరాజు నవీన కామారెడ్డి పట్టణంలోని ఓ లేడీస్ ఎంపోరియంలో పనిచేస్తూ ఉండేదని, గతంలో ఆమెకు వివాహం జరగగా భార్యాభర్తల మధ్య గొడవలు అవడంతో ప్రస్తుతం నవీన తల్లి వద్దనే ఉంటుందని తెలిపారు. భార్యాభర్తల మధ్య సర్ది చెప్పడానికి ప్రయత్నించిన తల్లి శోభకు కూతురు నవీన మధ్య గొడవ జరగడంతో బుధవారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లి శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story