- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తెలంగాణపై మళ్లీ ఆంధ్ర పెత్తనానికి కుట్ర
దిశ, ఆర్మూర్ : మోడీ సహాయంతో తెలంగాణపై మళ్లీ ఆంధ్ర పెత్తనానికి కుట్ర చేస్తున్నారని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని సుదర్శన్నగర్ తండా, సంతోష్నగర్ తండా, జాగిర్యాల, కుప్కల్, కుప్కల్ తండాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధికారం లోకి వస్తే తానే సీఎం అని చెప్పుకుంటున్న కిషన్ రెడ్డి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమంటే పారిపోయాడని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అని, తెలంగాణ ఏర్పడ్డాక 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ బీజేపీ సహకారంతో తెలంగాణలో అడుగు పెట్టిండని గుర్తు చేశారు. కాంగ్రెస్ కి అధికారం కట్టబెడితే ఢిల్లీకి తెలంగాణను అప్పగిస్తారని, బీజేపీకి అధికారం అప్పగిస్తే గుజరాత్ కి అప్పగించేస్తారన్నారు. అదాని, అంబానీలు వచ్చి మన భూములు లాక్కుంటారని మంత్రి హెచ్చరించారు. వరిధాన్యం సాగులో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో తెలంగాణ ఉందని, గతంలో ఆంధ్రలో ఈ విధంగా సాగయ్యేదని చెప్పారు. నియోజకవర్గంలో తాను వేయించిన డబుల్ రోడ్లు దండిగా పండిన ధాన్యానికి కల్లాలుగా రైతులు వాడుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల, స్థానిక గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.