130 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

by Sridhar Babu |
130 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
X

దిశ, భిక్కనూరు : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో 130 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయగా, పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిలో ఐదుగురిని గుర్తించి షాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపించారు.

శిబిరంలో పరీక్షలు చేసుకున్నవారికి ఆరోగ్య కేంద్రం నుంచి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎం హెచ్ ఓ చంద్రశేఖర్ క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో పాల్గొన్న అనంతరం ఆయన ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట ప్రాథమిక వైద్యాధికారిణి డాక్టర్ హెమిమా, ఫార్మాసిస్ట్ వెంకటరమణ తదితర వైద్య సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed