రౌడీ షీటర్లు తమ నడవడికను మార్చుకోవాలి

by Sridhar Babu |
రౌడీ షీటర్లు తమ నడవడికను మార్చుకోవాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రౌడీ షిటర్లు తమ నడవడికను మార్చుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేవార్ అన్నారు. శనివారరం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో రౌడీ షీటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్​ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 326 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, ఈ కార్యక్రమంలో రౌడీషీటర్ల దినచర్యలను వారి రాకపోకలను క్షుణ్ణంగా తెలుసుకోనున్నట్టు తెలిపారు. వాళ్లు ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు, ఎందుకోసం కలుస్తున్నారు, భవిష్యత్తులో ఎలాంటి అల్లర్లకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారు

అనే దానివి ఎప్పటికప్పుడు తెలుసుకుంటామన్నారు. రౌడీ షీటర్లు వారు ప్రతి రోజూ వారి ఉద్యోగం నిర్వహించుకుంటూ వారి ఇంటి వద్దనే ఉండాలని, ఏ తగాదాలలో పాల్గొనవద్దని, ప్రధాన కూడళ్లలో సమావేశాలు నిర్వహించకూడదని అన్నారు. రాత్రి సమయాల్లో హోటళ్ల వద్ద పాన్ షాపుల వద్ద ఉండరాదని సూచించారు. ఎవ్వరికైనా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిచించడం లేదా సమాజంలో ఉద్రిక్తతలను రేపే విధంగా వ్యవహరించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిసారీ చట్ట ప్రకారం కేసులు నమోదు అవుతుంటాయని, వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాము అని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ప్రొబైషనరీ ఐపీఎస్ బి. చైతన్య రెడ్డి, నిజామబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ఎల్. రాజా వెంకట్ రెడ్డి, బస్వారెడ్డి, పి. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed