బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్

by Mahesh |
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్
X

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. తొమ్మిదోవ డివిజన్ కార్పొరేటర్ సాయి వర్ధన్‌తో పాటు కులసంఘాల పెద్దలు, యూత్ భారీగా బీజేపీలో చేరడం జరిగింది. వారిని ఎమ్మెల్యే ధన్‌పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం అన్ని రంగాల్లో వికసిస్తుందని, భారతదేశాన్ని ప్రపంచదేశాల్లో అగ్రగామిగా, విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో బీజేపీ పార్టీ పని చేస్తుందని, కాంగ్రెస్ కీ ఓటు వేస్తే సోనియా, సోనియా గాంధీ పిల్లలు బాగుపడతారని, బీఆర్ఎస్ కీ ఓటు వేస్తె కేసిఆర్ కుటుంబం బాగుపడుతుందని, బీజేపీ కి ఓటు వేస్తే మాత్రం భారతదేశ పిల్లలు అందరూ బాగుపడతారని అన్నారు.

తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో కాంగ్రెస్ పైన ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను గాలికి వదిలి, ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడు దొంగలే అని, ఆ రెండు పార్టీల ఎజెండా కమిషన్లు, కుంభకోణాలు, కబ్జాలు చేసి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, ఈ పదేళ్లలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించామని హిందువుల ఏళ్ల నాటి కల బాల రాముని అయోధ్యలో ప్రతిష్టించి ప్రపంచ దేశాలను భారత్ వైపు చూసేలా చేసిన ఘనత బీజేపీ పార్టీదన్నారు.

అలాగే 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్, త్రిబుల్ తలాక్ రద్దు, కామన్ సివిల్ కోడ్, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించిన ఘనత కూడా బీజేపీదే అన్నారు. అంతేకాకుండా పేదోడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. తెలంగాణలో అధిక స్థానాలతో పాటు ఇందూర్ లో కూడా మరోసారి కాషాయ జెండా ఎగరడం పక్కా అని, అర్బన్ లో అత్యధికంగా లక్ష ఓట్లు సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఘర్ వాపసి లో భాగంగా తిరిగి బీజేపీ పార్టీలో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed